Tamilnadu: బాణాసంచా యూనిట్లో పేలుడు.. ఆరుగురు కార్మికులు మృతి

X
By - Prasanna |4 Jan 2025 3:04 PM IST
తమిళనాడు విరుదునగర్ లో బాణాసంచా యూనిట్లో పేలుడు సంభవించి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. రసాయనాలు కలిపే క్రమంలో పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు.
రోజు వారి కూలి పనులు చేస్తే కాని పొట్ట గడవని కార్మికులు వారు.. బాణా సంచా తయారీ యూనిట్ లో పని చేస్తూ పేలుడుకు ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులోని విరుదునగర్లోని బాణసంచా తయారీ యూనిట్లో శనివారం పేలుడు సంభవించి కనీసం ఆరుగురు కార్మికులు మరణించారు. రసాయనాలు కలిపే సమయంలో పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు. అధికారులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక, రెస్క్యూ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com