Train Accident : పట్టాలు తప్పిన డోర్నకల్ గూడ్స్ రైలు

Train Accident : పట్టాలు తప్పిన డోర్నకల్ గూడ్స్ రైలు

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ జంక్షన్‌ బ్రాంచి లైనులో గూడ్స్‌ రైలుకు చెందిన మూడు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. విజయవాడ నుంచి భద్రాచలం రోడ్‌కు 59 ఖాళీ వ్యాగన్లతో వెళ్తుండగా డోర్నకల్‌ బ్రాంచి లైనులోకి ప్రవేశించగానే ఇంజిన్‌ వెనకాల 17,18,19 వ్యాగన్లు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. బ్రాంచి లైనులో ఈ సంఘటన చోటుచేసుకున్నందున రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. విషయం తెలియగానే వివిధ విభాగాల అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రత్యామ్నాయ ఇంజిన్లు అమర్చి ముందున్న వ్యాగన్లను పోచారం వైపునకు, వెనకాలున్న వ్యాగన్లను పాపటపల్లి వైపునకు తీసుకెళ్లారు. పట్టాలు తప్పిన వ్యాగన్ల పునరుద్ధరణ రాత్రి మొదలైంది.

Next Story