Washington DC: ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న హైదరాబాద్ యువకుడు.. దుండగుల కాల్పుల్లో మృతి

X
By - Prasanna |20 Jan 2025 2:48 PM IST
వాషింగ్టన్ డీసీలో దుండగులు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి సోమవారం అమెరికాలో కాల్చి చంపబడ్డాడు.
అమెరికాలోని గ్యాస్ స్టేషన్లో హైదరాబాద్కు చెందిన 26 ఏళ్ల యువకుడిని దుండగులు కాల్చి చంపారు. హైదరాబాద్లోని ఆర్కే పురం గ్రీన్హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న రవితేజ మాస్టర్స్ డిగ్రీ కోసం మార్చి 2022లో US వెళ్ళాడు.
విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత, ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. స్థానిక పోలీసులు దాడి వెనుక ఉద్దేశ్యంపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారని అధికారులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com