Yuvagalam: నాగలి పట్టి దుక్కి దున్నిన లోకేష్‌

Yuvagalam: నాగలి పట్టి దుక్కి దున్నిన లోకేష్‌
కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా సాగుతున్న యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది

కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా సాగుతున్న యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆలూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. నాగలి పట్టి దుక్కి దున్నారు. కొంత దూరం వరకు ఉత్సాహంగా యువనేత పొలం దున్నారు. అనంతరం రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అన్నదాతల అభ్యున్నతికి కృషి చేస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.

Tags

Next Story