By - Vijayanand |9 Jun 2023 5:22 AM GMT
విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఎస్ఆర్ పురంలో ఐదేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తేజ కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే స్థానిక లారీ యార్డులో బాలుడు మృతదేహం లభించింది. తేజ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com