మహిళలు బంగారు పట్టీలు ఎందుకు ధరించకూడదు..

స్త్రీలు పట్టీలు ధరించడం అనాదిగా వస్తున్న భారతీయ సంప్రదాయం. పాపాయి పుట్టిన నెల రోజులకే కాళ్లకు కడియాల్లాంటివైనా వేసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. ఘల్లు ఘల్లున మోగా మువ్వలున్న పట్టీలు వేసుకుని ఆడపిల్లలు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు అంటుంటారు. అయితే పట్టీలు వెండితో చేసినవే మాత్రమే ఎందుకు ధరిస్తారు. అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు వివాహ సమయంలో కూడా కాలివేళ్లకు మెట్టెలు తొడుగుతారు. అవి కూడా వెండివే ఉంటాయి.
కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది పసిడితో చేసిన పట్టీలను వేసుకుంటున్నారు. అలా బంగారు పట్టీలు ధరించడం శుభప్రదం కాదంటున్నాయి శాస్త్రాలు. పురాణాల పరంగా కూడా దీని వెనుక అనేక కారణాలున్నాయి. హిందూ పురాణాల ప్రకారం అయితే బంగారం అంటే లక్ష్మి.. లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే ఇష్టం. ఈ క్రమంలో బంగారం కూడా పసుపు రంగులో ఉంటుంది కాబట్టి ఆ రంగు వస్తువులను ఎవరూ కాళ్ళకి ధరించకూడదని చెబుతున్నాయి.
ఇక సైన్స్ పరంగా చూస్తే. వెండి శరీరానికి చలువ చేస్తుంది. వెండి పట్టీలను ధరించడం వల్ల నడుము నొప్పి, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రక్తప్రసరణ సజావుగా సాగుతూ, పాదాలు వాపులు రాకుండా సహకరిస్తాయి.
కానీ అలాంటి నమ్మకాలతో కూడా, బంగారు చీలమండ దేవత పట్ల అగౌరవానికి చిహ్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం బంగారంతో చేసిన ఆభరణాలు మరియు ఉపకరణాలు శరీరాన్ని వేడిగా ఉంచుతాయి, అందువల్ల ఆదర్శవంతమైన ఎంపిక కాదు. మరోవైపు, వెండి శరీరాన్ని చల్లబరుస్తుంది. అందువల్ల, మీ శరీర ఉష్ణోగ్రతలో సమతుల్యతను సృష్టించడానికి బంగారాన్ని నడుము పైన ధరిస్తారు, మరియు వెండిని నడుము క్రింద ధరిస్తారు. బంగారు చీలమండ ధరించడం చాలా సింబాలిక్ కావచ్చు మరియు చాలా సందర్భాలలో, బంగారు చీలమండ ధరించిన ఒక మహిళ తాను వివాహం చేసుకున్నట్లు చూపిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com