కధా పానీయం.. జలుబు, దగ్గుకు చెక్ పెట్టే ఆయుర్వేద రెమెడీ

నాలుగు చినుకులు నెత్తిమీద పడితే చాలు తుమ్ములు మొదలు.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే దేనికీ తట్టుకునే శక్తి ఉండదు.. ఇంట్లో ఉన్న వస్తువులతోనే చిన్న చిన్న సమస్యలకు డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా తగ్గించుకోవచ్చు.
మారుతున్న వాతావరణ పరిస్థితులు అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. జలుబు, దగ్గు వంటి కాలానుగుణ వ్యాధులకు కారణమవుతుంది. అయితే, వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా తలెత్తే సమస్యలకు ఆయుర్వేదం చక్కని పరిష్కారాన్ని ఇస్తుంది. కధా లేదా 'కారా' అనేది ఇంట్లో ఉన్న దినుసులతో తయారుచేసిన పానీయం.
ఇది అనేక మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడుతుంది. వీటిని సాధారణంగా నీటిలో ఉడకబెట్టడం వల్ల వాటి ప్రయోజనాలను పొందడం జరుగుతుంది. ఈ మిశ్రమం మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్పడుతుంది.
తయారీ విధానం
కావలసినవి
నీరు: 2 కప్పులు
అల్లం: 1
లవంగాలు: 4
నల్ల మిరియాలు: 5-6
తులసి : 5-6 ఆకులు
తేనె: 1/2 టీస్పూన్
దాల్చిన చెక్క 1 అంగుళం
తయారీ విధానం
ఒక గిన్నెలో నీటిని వేడి చేసి అందులో మెత్తగా దంచిన అల్లం, లవంగాలు, నల్ల మిరియాలు, దాల్చినచెక్క వేయాలి. అందులోనే తులసి ఆకులు కూడా జోడించాలి.
మీడియం వేడి మీద సుమారు 20 నిమిషాలు ఉడికించాలి.
మిశ్రమాన్ని గ్లాసులో వడకట్టి, త్రాగడానికి ముందు కొన్ని చుక్కల తేనె జోడించండి
కధా పానీయం యొక్క ప్రయోజనాలు
ఈ ఆయుర్వేద మిశ్రమం జలుబు, దగ్గుకు వ్యతిరేకంగా ప్రభావవంతమైన యాంటీ-వైరల్ లక్షణాలను కలిగి ఉంది
ఇది శరీరంలోని శ్లేష్మాన్ని తగ్గించడంలో సహాయపడే ప్రభావవంతమైన మూలికలను కలిగి ఉంటుంది.
కధా రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. ఇది జలుబు, దగ్గు ఇన్ఫెక్షన్ గొంతును కూడా నయం చేస్తుంది.
ఇంట్లో తయారుచేసిన ఈ పానీయం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సాధారణ జలుబు లక్షణాలకు వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com