Health Tips: ఈ రెండు పండ్లను కలిపి తినొద్దు.. తింటే ప్రమాదమే..

Health Tips (tv5news.in)

Health Tips (tv5news.in)

Health Tips: అన్నం, కూరగాయలు.. వీటన్నింటికంటే పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.

Health Tips: అన్నం, కూరగాయలు.. వీటన్నింటికంటే పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ మనలోని చాలావరకు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అయితే ఫ్రూట్స్ తినేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు వైద్యులు. అయితే పండ్లకు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఏముంటుందిలే అనుకుంటున్నారా? ఉంటుంది.. ఈ రెండు పండ్లను కలిపి తింటే ఆరోగ్య సమస్యలను వస్తాయని వైద్యులు చెప్తున్నారు.

ఆరెంజ్, క్యారెట్: ఈ రెండిటిని ఎప్పుడు కలిపి తినొద్దు. అలా తినడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. గుండెల్లో మంటకు కూడా దారితీయొచ్చు.


దానిమ్మ పండు, నేరేడు పండు: ఈ రెండు పండ్లను కలిపి తింటే జీర్ణం అవ్వడం కష్టమే. అంతే కాకుండా మరికొన్ని జీర్ణ సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉంది.


జామ, అరటిపండు: గ్యాస్ సమస్యలు వస్తాయి. విపరీతమైన తలనొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.


బొప్పాయి పండు, నిమ్మ: ఈ రెండిటిని కలిపి తింటే రక్తంపై ప్రభావం చూపిస్తుంది. రక్తంలో హిమోగ్లో్బిన్ హెచ్చుతగ్గులు వస్తాయి. రక్తహీనత కూడా వచ్చే అవకాశం ఉంది.



Tags

Read MoreRead Less
Next Story