Eggs: షుగ‌ర్ పేషెంట్లు కోడిగుడ్లు తింటే ఏమవుతుంది?

Eggs: షుగ‌ర్ పేషెంట్లు కోడిగుడ్లు తింటే ఏమవుతుంది?
Diabetes People can Eat eggs:మధుమేహం రోగులు వారు తినే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు.

మధుమేహం రోగులు తినే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. వారి ఆరోగ్యానికి హాని చేయవని అనుకునే వాటినే వారు ఆహారంగా తిసుకుంటారు. అదేవిధంగా బొప్పాయి వంటికి ఎక్కువగా తింటారు. అయితే కోడి గుడ్డు విషయంలో మాత్రం డ‌యాబెటిక్‌ పేషెంట్లుకు ఎన్నో అనుమానాలు ఉంటాయి. కోడిగుడ్లు తింటే గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని చాలామంది డ‌యాబెటిక్ రోగులు భ‌య‌ప‌డుతుంటారు. కానీ అందులో వాస్తవం లేదని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.

కోడి గుడ్లు తీసుకోని వారికంటే గుడ్లు తినే వారిలోనే గుండే జబ్బుల ముప్పు తక్కువ‌గా ఉన్నద‌ని ఆ అధ్యయ‌నంలో వెల్లడైంది. ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో గుడ్డు వల్ల గుండె సమస్యలు తగ్గిన‌ట్లు అధ్య‌య‌న‌కారులు తెలిపారు. 'సిడ్నీ యూనివర్సిటీ' పరిశోధకులు జరిపిన ఆ అధ్యయనం ప్రకారం గుడ్డు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదే. ఏడాదిపాటు వారానికి 12 గుడ్ల చొప్పున తినే డయాబెటిక్‌, టైప్-2 డయాబెటిక్‌ బాధితులకు గుండె జబ్బుల ముప్పు ఉండదట.

పరిశోధనలో పాల్గొన్నవాలెంటీర్లను మొత్తం మూడు గ్రూపులుగా విభజించారు. వారిలో గరిష్టంగా వారానికి 12 గుడ్లు.. క‌నిష్టంగా ఒక గుడ్డు చొప్పున ఇచ్చారు. ఇలా మూడు నెలలపాటు వారికి గుడ్లు అందించారు. ఆ త‌ర్వాత చివరిగా అందరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. దాంతో గుడ్లు తీసుకోవడం వల్ల అందులోని ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు డ‌యాబెటిక్ రోగుల ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయని పరిశోధకులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. . 'సిడ్నీ యూనివర్సిటీ' పరిశోధకులు జరిపిన ఆ అధ్యయనం ప్రకారం.. గుడ్లు ఎక్కువ‌గా తిన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ప్రమాద కారకాలేవీ కనపించలేద‌ట‌.

Tags

Read MoreRead Less
Next Story