రాహుల్ గాంధీకి మరోమారు సమన్లు

రాహుల్ గాంధీకి మరోమారు సమన్లు

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి మరోమారు సమన్లు జారీ అయ్యాయి. ఏప్రిల్ 12న హాజరుకావాలని రాహుల్‌కి పాట్నా కోర్టు సమన్లు జారీ చేసింది. మోదీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ 2019లో పరువు నష్టం దావా పిటిషన్ వేశారు బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ. విచారణలో భాగంగా రాహుల్‌కి మరోమారు సమన్లు అయ్యాయి. అయితే ఇప్పటికే పరువు నష్టం కేసులో రాహుల్‌కి రెండేళ్ల జైలు శిక్ష పడింది. అప్పీల్ కోసం 30 రోజుల గడువు ఇవ్వడంతో పాటు బెయిల్ మంజూరు అయ్యింది. ఇక కోర్టు తీర్పుతో ఎంపీ పదవిని సైతం రాహుల్‌ కోల్పోవాల్సి వచ్చింది. ఇక తాజా పరిణామాలతో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు.

Read MoreRead Less
Next Story