మోదీ హయాంలో మత ఘర్షణలు పెరిగాయి:సీతారం ఏచూరి

X
By - Subba Reddy |9 April 2023 1:30 PM IST
కేంద్ర ప్రభుత్వంపై సీతారం ఏచూరి ఫైరయ్యారు. బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు
కేంద్ర ప్రభుత్వంపై సీతారం ఏచూరి ఫైరయ్యారు. బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన సీపీఐ, సీపీఎం సంయుక్త సమావేశంలో పాల్గొన్న సీతారాం ఏచూరి... మోదీ హయాంలో మత ఘర్షణలు పెరిగాయన్నారు. ఇక ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడు చేయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో పొత్తులేని పార్టీలకు కమ్యూనిస్టు పార్టీల మద్దతు ఉంటుందని కమ్యూనిస్టు పార్టీ జాతీయ నేతలు అన్నారు. ఇక బీజేపీతో కలిసే పార్టీలకు దూరంగా ఉంటామన్నారు. ఈ సమావేశంలో సీతారం ఏచూరి, డీ. రాజా, నారాయణ, రాఘవులు, కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com