Asad Encounter: స్పెషల్ టాస్క్ ఫోర్స్ పై ఆదిత్యానంద్ ప్రసంశలు వెల్లువ
By - Chitralekha |13 April 2023 10:04 AM GMT
ఉమేశ్ పాల్ హత్య కేసులో కీలక నిందితుడైన అసద్ ను ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎన్కౌంటర్ లో హతమార్చిన సంగతి తెలిసిందే. అతడితో పాటూ పోలీసులు గాలిస్తున్న మరో నిందితుడు గులామ్ సైతం ఈ ఎన్కౌంటర్ లో చనిపోయాడు. ఇదే విషయంపై ఉత్తర్ ప్రదేశ్ సీఎంస్ యోగీ ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ గురించిన సమాచారం అందుకున్న సీఎం హుటాహుటిన అధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ కు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్కౌంటర్ లో పాలుపంచుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులను ప్రశంసించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమతుల్యానికి వారు చేస్తున్న కృషిని కొనియాడారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com