శిక్షణ విమానం కూలి ఇద్దరు మృతి
By - Vijayanand |19 March 2023 1:45 AM GMT
పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చే విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ ట్రైనీ మహిళా పైలెట్ తో పాటు ట్రేనర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ భక్కుటోలా అటవీ ప్రాంతంలో శనివారం సంభవించింది. కూలిపోయిన విమానం ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీకి (IGRAU)కి చెందినదని తెలిపారు. ప్రాధమిక దర్యాప్తు ప్రకారం ప్రతికూల వాతావరణం వల్లనే విమానం కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com