ఒడిశా సీఎంను కలిసిన మమతా బెనర్జీ

ఒడిశా సీఎంను కలిసిన మమతా బెనర్జీ

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను కలిశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీలు రెడీగా ఉన్నట్లు ప్రకటించిన మమత.. ఇప్పటికే యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కూటమి కట్టినట్లు ప్రకటించారు. తాజాగా నవీన్ పట్నాయక్ ను కలిశారు. కాంగ్రెస్ లేకుండానే బీజేపీతో ఢీకొనడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. కర్ణాటక మాజీసీఎం కుమారస్వామిని శుక్రవారం కోల్ కతాలో కలవనున్నారు. ఈనెలాఖరున ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కూడా సమావేశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మమత నిర్మించబోయే థర్డ్ ఫ్రంట్ లో నవీన్ పట్నాయక్ ను చేర్చుకోవాలని ఆసక్తితో ఉన్నారు దీదీ. ఈ ఏడాది ఒడిశాలో హాకీ వరల్డ్ కప్ కు మమతను నవీన్ పట్నాయక్ ఆహ్వానించినా వెళ్లలేదు. అందుకుగాను ఇప్పుడు పత్యేకంగా పట్నాయక్ ను మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చినట్లు మమత తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story