Richest Temples: దేశంలోని ధనిక దేవాలయాలు.. అపార సంపదకు ప్రసిద్ధి

Richest Temples: దేశంలోని ధనిక దేవాలయాలు.. అపార సంపదకు ప్రసిద్ధి
Richest Temples: భారతదేశంలోని అనేక ప్రసిద్ధ దేవాలయాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఈ ఆలయాలలో కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించబడ్డాయి.

Richest Temples in India: భారతదేశంలోని అనేక ప్రసిద్ధ దేవాలయాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఈ ఆలయాలలో కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించబడ్డాయి.దేశంలోని ధనిక దేవాలయాలు.. అపార సంపదకు ప్రసిద్ధి భారతదేశంలోని అనేక ప్రసిద్ధ దేవాలయాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఈ ఆలయాలలో కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించబడ్డాయి. అపార సంపదకు ఆలవాలం ఈ అత్యద్భుత దేవాలయాలు. దేశంలో కొన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో 12 దేవాలయాలు అపార సంపదతో తులతూగుతుంటాయి.

తిరుమల వెంకటేశ్వర దేవాలయం, తిరుపతి


తిరుమల కొండపై ఉన్న శ్రీ వేంకటేశ్వర ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందిన పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. గోపురం క్రింద ఉంచబడిన 8 అడుగుల ఎత్తైన వేంకటేశ్వరుని విగ్రహం యొక్క కళ్ళు కర్పూర తిలకంతో కప్పబడి ఉంటుంది. విలువైన రాళ్లతో అలంకరించబడి ఉంది. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనిక యాత్రా కేంద్రంగా గుర్తింపు పొందింది.

శ్రీ పద్మనాభస్వామి ఆలయం, తిరువనంతపురం


శ్రీ పద్మనాభస్వామి ఆలయం తిరువనంతపురం నడిబొడ్డున ఉంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి కొలువై వుంటారు. దీనిని ట్రావెన్‌కోర్ మాజీ రాజ కుటుంబం నిర్వహిస్తోంది. పద్మనాభస్వామి విగ్రహం పడుకున్న స్థితిలో ఉండి భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలో బంగారు విగ్రహాలు, పురాతన వెండి, పచ్చలు, వజ్రాలు, ఇత్తడి వంటి మొత్తం ఆస్తుల విలువ సుమారు 90,000 కోట్లు ఉండవచ్చని అంచనా. విలువైన రాళ్లతో పొదిగిన రెండు బంగారు కొబ్బరి చిప్పలు కూడా స్వామి వారి సంపదలో నిక్షిప్తమై ఉన్నాయి.


సిద్ధివినాయక దేవాలయం, ముంబై


మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న సిద్ధివినాయక దేవాలయం ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ ఆలయాన్ని 1900ల ప్రారంభం నుండి యాత్రికులు సందర్శిస్తున్నారు. ముంబైలోని అత్యంత ధనిక దేవాలయం ఇది. పర్వదిన సమయాల్లో గంటల తరబడి క్యూ లైన్లలో వుండాల్సి వస్తుంది. ఆలయం యొక్క అద్భుతమైన శిల్పకళ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

షిర్డీ సాయిబాబా ఆలయం, షిర్డీ


షిర్డీ సాయిబాబా దేవాలయం ప్రపంచంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం 1922 సంవత్సరంలో నిర్మించబడిన ఒక అందమైన మందిరం. ఈ ఆలయం భారతదేశంలోని మూడవ అత్యంత ధనిక దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు వివిధ మతాలకు చెందిన వారు ఉంటారు.

గోల్డెన్ టెంపుల్, అమృత్‌‌‌‌సర్


గోల్డెన్ టెంపుల్ అనేది సిక్కుల చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. పై అంతస్తులు 400 కిలోల బంగారాన్ని ఉపయోగించి నిర్మించబడ్డాయి. అందుకే దీనికి 'గోల్డెన్ టెంపుల్' అని పేరు వచ్చింది. గురుద్వారాలో సిక్కు మతం యొక్క పవిత్ర గ్రంథం 'గురు గ్రంథ్ సాహిబ్' ఉంది. దీనికి ఎదురుగా ఉన్న భవనంలో మ్యూజియం ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటి.

మీనాక్షి ఆలయం, మదురై


ప్రతిరోజూ దాదాపు 20 నుండి 30 వేల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రతి ఏటా దాదాపు 60 మిలియన్ల ఆదాయం వస్తుంది. ఆలయ ప్రాంగణంలో దాదాపు 33,000 శిల్పాలు ఉన్నాయి. ఆలయ ప్రధాన దేవత మీనాక్షి, సుందరేశ్వరుని (శివుడు) భార్య. ఆలయంలో 45 నుండి 50 మీటర్ల ఎత్తులో 14 గోపురాలు ఉన్నాయి. ఈ ఆలయంలో రెండు బంగారు రధాలు కూడా ఉన్నాయి. దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఇది కూడా ఒకటి.

సోమనాథ్ ఆలయం, గుజరాత్


ఈ ఆలయం యొక్క అపారమైన సంపదను కొల్లగొట్టేందుకు ఘజనీకి చెందిన టర్కిక్ పాలకుడు మహమూద్ 17 సార్లు ప్రయత్నించాడు. ఈ ఆలయం ఇప్పటికీ భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా పిలువబడుతుంది.

శబరిమల అయ్యప్ప దేవాలయం, కేరళ


భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఇది ఒకటి. ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ల మంది భక్తులు సందర్శిస్తారు. ఈ ఆలయం ప్రధాన సముద్ర మట్టానికి 4,133 అడుగుల ఎత్తులో ఉంది. పురుషులకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ ఆలయం ఆదాయం దాదాపు రూ. 230 కోట్లు పై మాటే.

జగన్నాథ దేవాలయం, పూరి


ఇది భారతదేశంలోని మరొక గొప్ప దేవాలయం. ఇది మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. 2010 సంవత్సరం నివేదిక ప్రకారం దేవాలయం యొక్క బ్యాంకు డిపాజిట్ 150 కోట్ల కంటే ఎక్కువ. ఆలయానికి సుమారు రూ. 15,000 నుండి 20,000 పండగ సీజన్‌లో 6 రెట్లు ఎక్కువ. ఈ క్షేత్రానికి ప్రతిరోజూ 30,000 మంది భక్తులు, పండుగ సీజన్‌లో రోజుకు 70,000 మంది భక్తులు వస్తుంటారు.

స్వామినారాయణ ఆలయం, ఢిల్లీ


ఈ ఆలయం కేవలం భక్తులకు మాత్రమే కాదు, వాస్తుకళా ప్రేమికులకు కూడా ఒక దృశ్యమానం. ఈ అద్భుతమైన హిందూ పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలోని స్వామినారాయణుని విగ్రహం బంగారంతో చేయబడింది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నిస్ బుక్ రికార్డును కలిగి ఉంది.

వైష్ణో దేవి ఆలయం, జమ్మూ


వైష్ణో దేవి ఆలయం భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయ వార్షిక ఆదాయం రూ. 500 కోట్లు. తిరుపతి తర్వాత భారతదేశంలో అత్యధికంగా సందర్శించే దేవాలయాలలో ఇది రెండవది.

కాశీ విశ్వనాథ దేవాలయం, వారణాసి


శీ విశ్వనాథ్ ఆలయం భారతదేశంలోని అత్యంత గౌరవప్రదమైన మతపరమైన ప్రదేశాలలో ఒకటి. గతంలో అనేక సార్లు దోపిడీకి గురైంది. కూల్చివేయబడింది. అయినప్పటికీ తన వైభవాన్ని కాపాడుకుంటూనే ఉంది ఇప్పటికీ. ఈ ఆలయానికి వచ్చే వార్షిక విరాళం దాదాపు రూ. 4-5 కోట్లు., ఇది భారతదేశంలోని అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటిగా నిలిచింది.

Tags

Read MoreRead Less
Next Story