వందేభారత్ మిషన్ ద్వారా 15 లక్షల మంది స్వదేశానికి

వందేభారత్ మిషన్ ద్వారా 15 లక్షల మంది స్వదేశానికి
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందేభారత్ మిషన్ ద్వారా ఇప్పటివరకూ 15 లక్షల మందిని స్వస్థలాలకు చేర్చామని కేంద్ర పౌర

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందేభారత్ మిషన్ ద్వారా ఇప్పటివరకూ 15 లక్షల మందిని స్వస్థలాలకు చేర్చామని కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్దీప్‌సింగ్ పూరీ తెలిపారు. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సేవలను భారత్ నిలిపివేసిన సంగంతి తెలిసిందే. అయితే, విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు వందేభారత్ మిషన్ పేరిట మే 6 నుంచి ప్రత్యేక విమానాలను నడుపుతున్నారు. ఈ మిషన్ లో భాగంగా 4.5 లక్షల విమానాలు నడిపామని.. 15 లక్షల మందికిపైగా స్వస్థలాలకు చేర్చామని హ‌ర్దీప్‌సింగ్ పూరీ తెలిపారు. శనివారం కూడా 4,059 మంది దేశానికి తిరిగి వచ్చారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story