Chennai: విషాదం: బస్సు మిస్సైందని నాన్న బైక్ మీద బడికి తీసుకెళ్తుంటే..

Chennai: విషాదం: బస్సు మిస్సైందని నాన్న బైక్ మీద బడికి తీసుకెళ్తుంటే..
Chennai: మృత్యువు ముంచుకొచ్చింది. అందుకే బస్సు మిస్సైందేమో.. ఒకేసారి ఇద్దరు బిడ్డలనూ కోల్పోయిన ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.

Chennai: మృత్యువు ముంచుకొచ్చింది. అందుకే బస్సు మిస్సైందేమో.. ఒకేసారి ఇద్దరు బిడ్డలనూ కోల్పోయిన ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. అంబూరు సమీపంలో కంటైనర్ లారీ అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బండి మీద స్కూలుకు వెళుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, బండి నడుపుతున్న తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అంబూరు సమీపంలోని వీరప్పన్‌ కుప్పంకు చెందిన దండపాణి కుమార్తెలు జయశ్రీ (17), వరశ్రీ (12). బాలికలు పాఠశాల బస్సును మిస్సయ్యారు. దాంతో త్రండి వారిని డ్రాప్ చేసేందుకు బైక్ ఎక్కించుకుని వెళుతున్నారు.

వాహనం అంబూర్ పట్టణం సమీపంలోకి రాగానే, హోసూర్ నుండి చెన్నై వెళ్తున్న కంటైనర్ లారీ అదుపు తప్పి మీడియన్‌ను ఎక్కి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో వరశ్రీ, జయశ్రీ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, దండపాణికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనను కళ్లారా చూసిన పాదచారులు లారీ డ్రైవర్‌ను చితకబాదారు.. దీంతో అతడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు దండపాణిని అంబూర్ జిహెచ్‌కి చేర్చారు, అక్కడి నుండి వేలూరు జిఎంసిహెచ్‌కు రిఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story