మహారాష్ట్రలో మరో 346 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో మరో 346 మంది పోలీసులకు కరోనా పాజిటివ్
గడిచిన 24 గంటల్లో 346 మంది పోలీసులకు కరోనా సోకింది. దీంతో మహారాష్ట్రలో కరోనా బారిన పడి వారి సంఖ్య 14,641కు చేరింది.

మహారాష్ట్రలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఇక పోలీస్ శాఖలో కరోనా కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్రలో కరోనా బారిన పడుతున్న పోలీసుల సంఖ్య నిత్యం పెరుగుతోంది. ప్రతి రోజు వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 346 మంది పోలీసులకు కరోనా సోకింది. దీంతో మహారాష్ట్రలో కరోనా బారిన పడి వారి సంఖ్య 14,641కు చేరింది.

మరోవైపు కరోనాతో చికిత్స పొందుతూ గడిచిన 24 గంటల్లో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన పోలీసుల సంఖ్య 148కి చేరింది. కరోనా బారి నుంచి 11,752 మంది పోలీసులు కోలుకున్నారు. ప్రస్తుతం 2,741 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా పలు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, మహారాష్ట్రలో ఇప్పటి వరకు 7.19 లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా 23,089 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story