రూ.50లక్షల ఖర్చు.. కోవిడ్ నుంచి కోలుకున్నా దక్కని ప్రాణం..
కరోనా ఆమె కలల్ని కాల రాసింది. కళ్యాణం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడదామనుకున్న ఆ యువతి ప్రాణాలను బలి తీసుకుంది.

కరోనా ఆమె కలల్ని కాల రాసింది. కళ్యాణం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడదామనుకున్న ఆ యువతి ప్రాణాలను బలి తీసుకుంది. 40 రోజులు మృత్యవుతో పోరాడి చివరకు అలసి పోయి కన్నుమూసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన పెండ్యాల రవీందర్ రెడ్డి కుమార్తె నరిష్మ రెడ్డి (28). హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఏడున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడ సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. పెళ్లి చేసుకుందామని స్వదేశాని వచ్చిన ఆమెకు వైరస్ సోకింది.
చికిత్స తీసుకుని కోవిడ్ నుంచి కోలుకుంది. మే నెలాఖరులో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు కుటుంబసభ్యులు. కానీ నరిష్మకు కోవిడ్ ప్రభావం ఊపిరితిత్తులపై ఎక్కువగా పడింది. దాంతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. 40 రోజులకు పైగా మృత్యువుతో పోరాడి చివరకు మంగళవారం రాత్రి ఆమె కన్నుమూసింది. చికిత్స కోసం రూ. 50 లక్షలు ఖర్చు చేశామని అయినా ప్రాణం దక్కలేదని నరిష్మ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
RELATED STORIES
Donald Trump: టెక్సాస్ కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందన.. బైడెన్పై...
28 May 2022 9:45 AM GMTJapan: ఇదేం ఆనందమో.. రూ.12 లక్షలు ఖర్చుపెట్టి శునకంలా మారిన మనిషి
26 May 2022 7:22 AM GMTHong Kong: కొడుకు చేతిలో బొమ్మ విరిగింది.. దుకాణదారుడికి రూ.3 లక్షలు...
25 May 2022 11:15 AM GMTAmerica: అమెరికాలో మారణహోమం.. 18 మంది పిల్లలు, ముగ్గురు టీచర్లు...
25 May 2022 9:45 AM GMTNarendra Modi: క్వాడ్ దేశాల సదస్సులో మోదీ.. పలువురు దేశాధినేతలతో...
24 May 2022 9:45 AM GMTChina Corona: చైనా రాజధానిలో మళ్లీ లౌక్డౌన్.. ఇప్పటికే పలు జిలాల్లో...
23 May 2022 4:15 PM GMT