దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం..!

X
By - TV5 Digital Team |25 April 2021 3:00 PM IST
దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటుకు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పీఎం కేర్స్ నిధుల నుంచి వీటిని యుద్ధప్రాతిపదికన నిర్మించనున్నారు.
దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటుకు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పీఎం కేర్స్ నిధుల నుంచి వీటిని యుద్ధప్రాతిపదికన నిర్మించనున్నారు. దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. వీలైనంత త్వరగా ప్లాంట్ల ఏర్పాటు జరగలాని ప్రధాని మోదీ ఆదేశించారు. ఆయా ఆస్పత్రులకు నిరంతరాయంగా ఆక్సిజన్ అందించాలన్న లక్ష్యంతోనే ఈ క్యాప్టివ్ ప్లాంట్లకు శ్రీకారం చుడుతున్నట్టు కేంద్రం చెప్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com