Delhi: మస్కిటో కాయిల్ పరుపు మీద పడడంతో నిద్రిస్తున్న ఆరుగురు..

Delhi: మస్కిటో కాయిల్ పరుపు మీద పడడంతో నిద్రిస్తున్న ఆరుగురు..
Delhi: అన్ని డోర్లు మూసి ఉంచినా ఎక్కడి నుంచో దోమలు ఎగురుకుంటూ వచ్చేస్తాయి. చెవిలో గీ మని సొదపెడుతుంటాయి.

Delhi: అన్ని డోర్లు మూసి ఉంచినా ఎక్కడి నుంచో దోమలు ఎగురుకుంటూ వచ్చేస్తాయి. చెవిలో గీ మని సొదపెడుతుంటాయి. దీంతో నిద్ర పోయేటప్పుడు కాయిల్స్ కంపల్సరీ వెలిగిస్తుంటారు. అయితే అదే వారి ప్రాణాల మీదకు తెచ్చింది. వెలిగించిన కాయిల్ పరుపు మీద పడి గదిలో నిద్రపోతున్న ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న మస్కిటో కాయిల్‌ను కుటుంబసభ్యులు వెలిగించారు, అది పరుపుపై ​​పడింది. మెట్రెస్‌కు మంటలు అంటుకోవడంతో గది మొత్తం పొగతో నిండిపోవడంతో ఊపిరాడక కుటుంబ సభ్యులు మరణించారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక పసిబిడ్డ ఉన్నారు. "15 ఏళ్ల బాలికతో సహా ఇద్దరు వ్యక్తులు కాలిన గాయాలకు చికిత్స పొందుతున్నారు" అని పోలీసులు వివరించారు. "విషపూరిత పొగలు నిద్రిస్తున్న వారిని స్పృహ కోల్పోయేలా చేశాయి. దాంతో వారంతా ఊపిరాడక మరణించారు" అని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story