70 ఏళ్లకు పైబడిన పింఛనుదారులకు ఈపీఎఫ్‌వో షాక్‌

70 ఏళ్లకు పైబడిన పింఛనుదారులకు ఈపీఎఫ్‌వో షాక్‌
అధిక వేతనంపై యజమానితో కలిసి ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్‌ ఆధారాలను అందజేయాలని సూచన

దేశవ్యాప్తంగా 70 ఏళ్లకు పైబడిన ఈపీఎఫ్‌ పింఛనుదారులకు ఈపీఎఫ్‌వో షాక్‌ ఇచ్చింది. 2014 సెప్టెంబరుకు ముందు ఉద్యోగ విరమణ చేసి, అధిక వేతనంపై అధిక పింఛను పొందుతున్న వారికి నోటీసులు జారీ చేసింది. సర్వీసులో ఉన్నప్పుడు అధిక వేతనంపై యజమానితో కలిసి ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్‌ ఆధారాలను అందజేయాలని సూచించింది. వారం రోజుల్లోగా ఆధారాలు సమర్పించకుంటే ఇప్పటివరకు చెల్లింపులు చేసిన అధిక పింఛను మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలిపింది. దీంతో రాష్ట్రంలో 2015 సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అధిక పింఛనుకు అర్హత పొందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్‌ సంస్థల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 50వేల మంది వరకు ఈ తరహా పింఛనుదారులు ఉంటారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story