Chhattisgarh Railway Station Blast: రాయ్పూర్ రైల్వే స్టేషన్లో పేలుడు.. ఆరుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు..

Chattisgarh railway station blast: ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ రైల్వే స్టేషన్లో పేలుడు అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఆరుగురు CRPF సిబ్బంది గాయపడ్డారు. డిటోనేటర్ పేలుడు వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఉదయం ఆరున్నరకు ప్లాట్ఫామ్ 2పై ఈ ఘటన జరిగింది. జార్సుగూడ నుంచి జమ్ముతావీకి వెళ్తున్న ట్రైన్ ప్లాట్ఫామ్పై ఆగి ఉన్న సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఇగ్నిటర్ సెట్ ఉన్న బాక్స్ జారి పడడం వల్లే ఈ పేలుడు జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. గాయపడ్డవారందరికీ స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
రాయ్పూర్ రైల్వే స్టేషన్లో పేలుడు..
ఆరుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు
ఇగ్నిటర్ సెట్ ఉన్న బాక్స్ జారి పడడం వల్లే పేలుడు
జార్సుగూడ నుంచి జమ్ముతావీకి వెళ్తున్న జవాన్లు
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com