Bhagwant Singh Mann : పంజాబ్లో కొలువుదీరిన ఆమ్ ఆద్మీ సర్కార్..!
By - TV5 Digital Team |16 March 2022 9:00 AM GMT
Bhagwant Singh Mann : పంజాబ్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేశారు.
Bhagwant Singh Mann : పంజాబ్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలన్లో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్.. మాన్ చేత ప్రమాణం చేయించారు. ఇదే వేదికపై సీఎంగా బాధ్యతలు స్వీకరించారు భగవంత్ మాన్. ఈ కార్యక్రమానికి పంజాబ్ ప్రజలంతా పసుపు రంగు తలపాగాలు ధరించి మాన్ను ఆహ్వానించారు. దీంతో ఖట్కర్ కలన్ గ్రామం పసుపువర్ణమైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం పసుపు రంగు తలపాగా ధరించి కన్పించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com