Meera Chopra : పది రోజుల్లో ఇద్దరు కుటుంబసభ్యులు..: నటి మీరా చోప్రా ఆవేదన

Meera Chopra : పది రోజుల్లో ఇద్దరు కుటుంబసభ్యులు..: నటి మీరా చోప్రా ఆవేదన
సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, ప్రముఖ వ్యక్తులు. ఆక్సిజన్ అందక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు

Meera Chopra: ఒకప్పుడు ప్రముఖ వ్యక్తి రికమండేషన్, వీఐపీతో ఓ ఫోన్ కాల్.. నిమిషాల్లో పనైపోయేది.. కానీ కరోనా సీజన్ ఆ ఆటలేం సాగట్లేదు.. ఎంత పెద్ద సెలబ్రెటీ అయినా బెడ్డు లేకపోతే అంబులెన్స్ లోనే జీవచ్చవాల్లా గడుపుతున్నారు, సమయానికి చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్న సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, ప్రముఖ వ్యక్తులు. ఆక్సిజన్ అందక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్నట్టుండి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

ఈ దుస్థితికి ప్రభుత్వాన్ని నిందిస్తున్నవారు ఎందరో. అందులో నటి మీరా చోప్రా కూడా ఒకరు. ఆమె కజిన్స్ ఇద్దరు ఇటీవల కరోనా బారిన పడి పది రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వచ్చి ఇంట్లో ఊపిరి ఆడట్లేదని పరుగు పరుగున ఆస్పత్రికి వస్తే సమయానికి చికిత్స అందక కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించలేని సర్కారుకు 18 శాతం జీఎస్టీని మాత్రం ఎందుకు చెల్లించాలంటూ కామెంట్ చేశారు.

బెడ్ దొరక్క ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని ఊహించలేదని ఆవేదన చెందారు. తక్షణం 18 శాతం జీఎస్టీని తొలగించాలని ఆమె డిమాండ్ చేసింది. తెలుగులో వాన, పవన్ కళ్యాణ్ సరసన బంగారం సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది మీరా చోప్రా.

Tags

Read MoreRead Less
Next Story