Adani Effect: ఆర్బీఐ రంగప్రవేశం

X
By - Subba Reddy |2 Feb 2023 1:00 PM IST
అదానీ గ్రూప్ కంపెనీలకు ఇచ్చి రుణాల వివరాలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు
అదానీ వ్యవహారం రోజు రోజుకీ ముదురుతోంది. అదానీ గ్రూప్ కంపెనీలకు ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా రుణాలు ఇచ్చాయని వార్తలు వస్తున్నాయి. పార్లమెంటులో కూడా విపక్షాలు ఇదే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. దీంతో భారత రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగింది. అదానీ గ్రూప్ కంపెనీలకు ఇచ్చి రుణాల వివరాలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. మరోవైపు మార్జిన్ రుణాల కోసం తాకట్టుగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లను తీసుకోవడం లేదని సిటీ గ్రూప్ స్పష్టం చేసింది. ప్రధాన షేర్లు కూడా భారీ నష్టాలతో ట్రేడవుతున్నందున... సిటీ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. అదానీ కంపెనీ బాండ్లను తాము తీసుకోమని క్రెడిట్ సూసె నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com