కరోనా ఎఫెక్ట్.. ఆధార్‌కి పాన్ కార్డ్ లింక్ గడువు పొడిగింపు! ‌

కరోనా ఎఫెక్ట్.. ఆధార్‌కి పాన్ కార్డ్ లింక్ గడువు పొడిగింపు! ‌
ఎవరైతే నిర్దేశించిన ఆఖరు తేదీ లోపున ఆధార్, పాన్ అనుసంధానం చేసుకోరో వారిపై చర్యలు తీసుకునేందుకు సెక్షన్ 234H వీలు కల్పిస్తుంది.

ఇవాళ్టితో ( మార్చి 31,2021)తో పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డు కనుక లింక్ చేయకపోతే, రేపటి నుంచి సదరు పాన్ కార్డు చెల్లుబాటు కాదు అనే ఆదేశాలను కేంద్రం వాయిదా వేసింది. నిర్దేశించిన తేదీలోపు ఈ రెండిటి లింకేజీ జరగకపోతే వెయ్యి రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుందనే యాక్ట్ ‌ని కూడా జూన్ 30 వరకూ వాయిదా వేస్తూ కేంద్రం ప్రకటన జారీ చేసింది.

వాస్తవానికి ఏప్రిల్ 1,2021 నుంచే ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో కొత్తగా చేర్చిన సెక్షన్ 234H ప్రకారం ఈ చర్యలు తీసుకునేందుకు కేంద్రప్రభుత్వానికి అధికారం దక్కింది. ఈ నెల 23న ఇందుకు సంబంధించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఐతే దేశంలో కరోనా రెండో దశ విజృంభించిన కారణంగా తమ ఆదేశాల అమలును జూన్ నెలాఖరు వరకూ వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఎవరైతే నిర్దేశించిన ఆఖరు తేదీ లోపున ఆధార్, పాన్ అనుసంధానం చేసుకోరో వారిపై

చర్యలు తీసుకునేందుకు సెక్షన్ 234H వీలు కల్పిస్తుంది. ఈ తేదీ ఇప్పటికే బోలెడుసార్లు వాయిదా వేస్తూ గడువు పెంచుతూ వచ్చారు.గత ఏడాది మార్చి 31న కూడా ఇలానే వాయిదా వేసారు. తర్వాత సెప్టెంబర్ , ఆ తర్వాత డిసెంబర్ 2020 ఇలా. వాయిదాలపై వాయిదా పడుతున్న ఈ నిర్ణయం అమలు తాజా వాయిదాతో మరోసారి పాన్ కార్డ్ ఉండి ఆదార్ లింక్ చేయనివారికి ఊరట కల్పించింది.

గతంలో ఆధార్ పాన్ కార్డ్ లింక్ చేయకపోతే జరిమానా విధించడానికి అవకాశం లేదు. కానీ కొత్త చట్టంతో ఫైన్ వేస్తారు, ఐతే పాన్ కార్డు పని చేయకపోతే, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరగవు కాబట్టి..ఇది ఎవరికి వారు విధిగా చేసుకోవాల్సిన పనే. ఎందుకంటే పాన్ కార్డ్ లేకుండా ఐటీ రిటన్స్ దాఖలు చేయలేరు. అలానే బ్యాంక్ అక్కౌంట్లు తెరవలేరు.

ఓ వేళ తెరిచినా టిడిఎస్ ఎక్కువగా కట్ అవుతుంది.భవిష్యత్తులో ఇలా పాన్ కార్డు జత చేయకుండా లావాదేవీలు నిర్వహించినందుకు ఆదాయపు పన్ను చట్టంలోని 272B సెక్షన్ ప్రకారం పదివేల రూపాయల జరిమానా కూడా విధించవచ్చు

ఐతే ఇంత పకడ్బందీగా ప్రచారం చేసినా చాలామంది పాన్-ఆధార్ లింకేజీ గడువు ఖచ్చితంగా వాయిదా వేస్తారనే ముందు నుంచి ధీమాగా ఉన్నారు. దానికి తగ్గట్లే కేంద్రం గడువు పెంచడం కూడా చోటు చేసుకుంది. వాస్తవానికి చాలా బ్యాంకులు ముందు పాన్ కార్డ్‌తో బ్యాంక్ అక్కౌంట్ ఓపెన్ చేస్తున్నారు. తర్వాత అదే బ్యాంక్ అక్కౌంట్‌కి ఆధార్ కార్డ్ లింక్ చేస్తున్నారు.

అలా పరోక్షంగా ప్రతి బ్యాంక్ అక్కౌంట్ హోల్డర్‌ ఆధార్, పాన్ కార్డ్ డీటైల్స్ వారి దగ్గరే ఉంటున్నాయ్. ఐనా కేంద్రం మాత్రం ఇలా ఇంకా పాన్-ఆధార్ లింకేజీ అంటూ డెడ్‌లైన్లు విదించడం విడ్డూరమే, మరోవైపు రెండేళ్ల క్రితం బడ్జెట్‌లో కూడా ప్రతి ట్రాన్సాక్షన్‌కి ఆధార్‌ని లింక్ చేస్తామని చెప్పారు. అప్పట్లోనే ఇక పాన్ పనైపోయినట్లేనా అంటూ విమర్శలు కూడా వచ్చాయ్.

ఏదెలా ఉన్నా ప్రస్తుతానికి మాత్రం ఆధార్-పాన్ అనుసంధానం గడువు మరో మూడు నెలలకు కేంద్రం , ఆఖరి రోజున పెంచడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story