Chhattisgarh: పెళ్లైన నాలుగేళ్లకే కుమారుడి మరణం.. కోడలికి మళ్లీ పెళ్లి చేసిన మాజీ ఎంపీ

Chhattisgarh: పెళ్లైన నాలుగేళ్లకే కుమారుడి మరణం.. కోడలికి మళ్లీ పెళ్లి చేసిన మాజీ ఎంపీ
Chhattisgarh: భాజపా మాజీ ఎంపీ చందూలాల్ సాహు వింతతువు అయిన తన కోడలి జీవితంలో వెలుగులు నింపారు.

Chhattisgarh: భాజపా మాజీ ఎంపీ చందూలాల్ సాహు వింతతువు అయిన తన కోడలి జీవితంలో వెలుగులు నింపారు. పెళ్లైన నాలుగేళ్లకే కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఒకటిన్నర సంవత్సరం వయసున్న కొడుకును పెట్టుకుని కోడలు కల్యాణి ఒంటరిగా జీవిస్తోంది.


కొడుకు మరణంతో కోడలి జీవితం మోడువారకూడదని భావించారు చందూలాల్. మాజీ ఎంపీ డాక్టర్ వీరేంద్ర గంజీర్‌‌ భార్య గుండెపోటుతో మరణించింది. ఆయనకు ఒక కుమార్తె ఉంది. దీంతో ఇద్దరికీ వివాహం చేయాలని భావించారు చందూలాల్. ఇరు కుటుంబాలను సంప్రదించి తండ్రి స్థానంలో ఉండి తన కోడలికి వివాహం జరిపించారు.

తన కోడలు మరియు మనవడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, సాహు తన కోడలికి సరిపోయే వ్యక్తి కోసం అన్వేషించారు. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి వరుడు దొరికాడు. దాదాపు పదేళ్ల క్రితం కల్యాణికి మొదటి వివాహం జరిగింది.


పెళ్లయిన నాలుగేళ్లకే భర్త చనిపోవడంతో ఆమె జీవితం చీకటిగా మారిపోయింది. డాక్టర్ గంజీర్‌ది కూడా దాదాపు అదే స్టోరీ కావడంతో ఇద్దరికీ ముడివేశారు పెద్ధలు. 'తులసి పూజ' శుభదినం రోజున, కల్యాణి డా. వీరేంద్ర గంజీర్‌‌ల వివాహం ధామ్తరిలోని వింధ్యవాసిని ఆలయంలో జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story