మెట్రో నగరానికి మేయర్.. కానీ ఉండేది రేకుల ఇంట్లో.. !

మెట్రో నగరానికి మేయర్.. కానీ ఉండేది రేకుల ఇంట్లో.. !
ఒక్కసారి కౌన్సిలర్ అయితేనే లక్షలకి లక్షలు వెనకేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అహ్మదాబాద్‌‌‌‌కు కొత్త మేయర్ గా ఎన్నికైన కిరీట్ పర్మార్.. ఇప్పటికీ రేకుల షెడ్డులోనే ఉంటున్నారు.

ఒక్కసారి కౌన్సిలర్ అయితేనే లక్షలకి లక్షలు వెనకేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అహ్మదాబాద్‌‌‌‌కు కొత్త మేయర్ గా ఎన్నికైన కిరీట్ పర్మార్.. ఇప్పటికీ రేకుల షెడ్డులోనే ఉంటున్నారు. కిరీట్ పర్మార్ ఇప్పటికీ రెండు పర్యాయాలు కౌన్సిలర్‌‌‌గా కూడా పనిచేశారు. అతడుంటున్న రేకుల ఇంట్లో రోజువారీ అవసరాలు తప్పా.. లగ్జరీ సోఫా, ఫ్రిజ్ వంటి వస్తువులు లేవు. కాగా కిరీట్ పర్మార్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.

కిరిట్ కు చిన్నప్పటి నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తో సంబంధం ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ నిబంధనలను అనుసరించి, జీవితకాల వివాహం చేయకూడదని అయన నిర్ణయించుకున్నారు.


కిరీట్ పర్మార్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఒక సాధారణ వ్యక్తికి ఇంత పెద్ద పదవి ఇచ్చిన బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పథకాలు సామాన్యులను చేరుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానని తెలిపారు.

అంతేకాకుండా.. జీవితాతం దేశసేవ చేస్తానని తెలిపారు. కిరీట్ పర్మార్ కు ముందు, కనాజీ ఠాకూర్ అహ్మదాబాద్ మేయర్ గా ఉన్నారు. ఆయన కూడా సాధారణ ప్రజలలాగే జీవించారు. మేయర్ గా ఎన్నికైన తరువాత ప్రభుత్వం ఆయనకీ ఓ బంగ్లాను నివాసంగా ఏర్పాటు చేసింది.

కానీ దానికి ఆయన నిరాకరించి.. మధుపురం ప్రాంతంలోని ఒక గదిలో నివాసం ఉన్నారు. ఇప్పటికీ ఆయన అదే గదిలోనే ఉంటున్నారు.. ప్రస్తుతం కనాజీ ఠాకూర్ అహ్మదాబాద్ కార్పొరేషన్ పార్లమెంటరీ బోర్డు సభ్యుడుగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story