Air India: ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ ప్రయాణికుడి భోజనంలో పురుగులు..

Air India: సామాన్యులు కాదు వాళ్లు చూసీ చూడనట్లు వదిలేయడానికి, బిజినెస్ క్లాస్ పీపుల్. ముంబై నుంచి చెన్నై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహావీర్ జైన్ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. విమానంలో తనకు వడ్డించిన భోజనంలో పురుగులు ఉన్నాయని ట్వీట్ చేశాడు. క్లిప్లో సగం తిన్న ఆహారంలో ఒక కీటకం పాకుతున్నట్లు చూపబడింది. జైన్ ఫిర్యాదుపై విమానయాన సంస్థ వెంటనే స్పందించింది. "ప్రియమైన మిస్టర్ జైన్, మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. మమ్మల్ని క్షమించండి. మరింత శ్రద్ధ పెడతాము. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాము అని ఎయిర్ ఇండియా తెలిపింది. నెటిజన్లు విమానయాన సంస్థపై విరుచుకుపడ్డారు. ప్రయాణీకులు సౌకర్యవంతమైన విమానాల కోసం ఇంత ఖర్చు చేస్తున్నప్పుడు ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం సంస్థపై తమ నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది అని ట్వీట్ చేస్తున్నారు.
@airindiain insect in the meal served in businessclass pic.twitter.com/vgUKvYZy89
— Mahavir jain (@mbj114) February 27, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com