Covishield : కొ-విన్ పోర్టల్ లో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం.. !
By - TV5 Digital Team |16 May 2021 3:23 PM GMT
కొ-విన్ పోర్టల్ లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. కొవిల్డ్ వ్యాక్సిన్ 2వ డోసు వ్యవధి పెంపునకు అనుగుణంగా ఈ మార్పులు చేశారు.
Covishield : కొ-విన్ పోర్టల్ లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. కొవిల్డ్ వ్యాక్సిన్ 2వ డోసు వ్యవధి పెంపునకు అనుగుణంగా ఈ మార్పులు చేశారు. కొవిషీల్డ్ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారు ఇకపై 84 రోజుల తర్వాతే 2వ డోసు కోసం బుక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొవిల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచిన విషయాన్ని రాష్ట్రాలు గుర్తించాలన్న కేంద్రం.. ఈ మార్పులపై రాష్ట్రాలు ప్రజలకు అవగాహన కల్పించాలంది. కాగా రెండో డోసు కోసం ఇది వరకే అపాయింట్మెంట్ తీసుకుంటే అది చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. వ్యాక్సిన్ కోసం వచ్చిన ఎవర్నీ తిప్పి పంపొద్దని కేంద్రం తాజా ఆదేశాల్లో పేర్కొంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com