Arvind Kejriwal :బెదిరింపు కాల్... తీరా చూస్తే..!

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం అర్థరాత్రి ఓ వ్యక్తి కేజ్రీవాల్ కు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడి ఫోన్ నెంబర్ ను ట్రాక్ చేశారు. అతడు నివసిస్తున్న ప్లేస్ కు వెళ్లి చూడగా. కాల్ చేసిన వ్యక్తి మానసిక వ్యాధిగ్రస్థుడని గుర్తించారు. అతని పేరు జై ప్రకాష్ (38) అని, నిందితుడు ఢిల్లీలోని గులాబీ బాగ్ లో చికిత్సపొందుతున్నాడని చెప్పారు. నిందితుడు ఆరోగ్య రిత్యా అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.
అర్ధరాత్రి కేజ్రీవాల్ కు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో ఢిల్లీ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు.. నిమిషాల వ్యవధిలోనే నిందితుడి ఫోన్ కాల్ ను ట్రాక్ చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి మానసిక వికలాంగుడు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com