Assam: భర్తని, అత్తని చంపి... ఫ్రిజ్ లో....

Assam: భర్తని, అత్తని చంపి... ఫ్రిజ్ లో....
అస్సామ్ లో దారుణం; భర్తని, అత్తని చంపి, ఖండఖండాలుగా నరికి, ఫ్రిజ్ లో కుక్కి.....

ప్రియురాలిని చంపి ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో దాచి చేతులు దులుపుకోబోయి ఊచలు లెక్కపెడుతున్న నర రూపరాక్షసులపై రోజుకొక వార్త పుట్టుకొస్తూనే ఉంది. అస్సోం లో కూడా ఇంచుమించు ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే ఇక్కడ పాత్రలు తారుమారు అయ్యాయి. ఓ మహిళ తన భర్తను, అత్తను చంపి, ఫ్రిజ్ లో పెట్టి, క్రమంగా వారి శరీర భాగాలను వదిలించుకే ప్రయత్నం చేసింది. ఈ ఘటన ఏడు నెలల క్రితం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూనామతి ప్రాంతానికి చెందిన బంధనా కలితా తన భర్త అమర్జ్యోత్ డే, అత్తగారు శంకరీ డేని దారుణంగా హత్యచేసింది. ఇద్దరు స్నేహితులతో కలసి ఆగస్ట్ 17, 2022లో ఇద్దరినీ కిరాతంగా నరికేసింది. వారి శరీరాలను ముక్కలుగా చేసి ఇంట్లోని ఫ్రిజ్ లో పెట్టేసి వెళ్లిపోయింది. మళ్లీ నాలుగు రోజులకు వచ్చి శరీర భాగాలను గౌహతికి 200 కీమీల దూరంలోని మేఘాలయలోని దావ్కీ నదిలో పడేసింది. ఆ సమయంలోనే ఆమె ఇంటిపైన సామాగ్రిని తగలబెట్టడం చూశామని ఇరుగు పొరుగు పోలీసులకు తెలిపారు. విచారణ అనంతరం బంధనకు సహాయం చేసిన ఇద్దరు స్నేహితులు ఆరుప్ ధేఖా, ధన్జీత్ ధేఖాలను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story