BBC Row: సుప్రీంను ఓక టూల్గా ఉపయోగించుకుంటున్నారు: ఆర్ఎస్ఎస్

సుప్రీం కోర్టుపై ఆర్ఎస్ఎస్ అధికారిక వార పత్రిక పాంచజన్య కీలక వ్యాఖ్యలు చేసింది. భారత వ్యతిరేక శక్తులు సుప్రీంకోర్టును ఒక టూల్గా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించింది. గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాంచజన్య లింక్ను సామాజిక మాధ్యమాల్లో బ్లాక్ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నోటీసులు జారీ చేయడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.
దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పడిన సుప్రీం కోర్టును కొన్ని శక్తులు తమ దారుల్లోని అడ్డంకులను తొలగించుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయని తన సంపాదకీయంలో తప్పుబట్టింది. అంతర్జాతీయంగా భారత్కు చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతోనే మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిందని ఆరోపణలు చేసింది. అది ఆధారాల్లేని కట్టుకథ అని ఇలాంటి వాటిని దేశ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపు నిచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com