బిహార్ చివరి దశ పోలింగ్ కు సర్వం సిద్దం

బిహార్ చివరి దశ పోలింగ్ కు సర్వం సిద్దం

బీహార్ చివరి దశ ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లుచేసింది. మూడోవది, చివరి దశలో 78 అసెంబ్లీ స్థానాలకు గాను రేపు పోలింగ్ జరుగనుంది. ఇందుకు గాను అధికారులు సర్వం సిద్దంచేశారు. 78 స్థానాలకు గాను ...12వందల మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. మూడో దశలో రెండు కోట్ల 35లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తైంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 10న వెలువడనున్నాయి. చివరి దశ ప్రచారంలో భాగంగా ఎన్డీయే తరుపున ప్రధాని నరేంద్రమోదీ 12 ప్రచార సభల్లో పాల్గొనగా.. మహాకూటమి తరుపున రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రచారం చేశారు. పోలింగ్ సందర్బంగా అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా బలగాలను మోహరించారు.


Tags

Read MoreRead Less
Next Story