డబ్బు డ్రా చేసేందుకు బ్యాంకుకు వచ్చిన 'శవం'

డబ్బు డ్రా చేసేందుకు బ్యాంకుకు వచ్చిన శవం
అతడి మరణం తరువాత, గ్రామస్తులు బ్యాంకుకు వెళ్లి అతడి ఖాతాలోని డబ్బును ఇమ్మని

బీహార్ రాజధాని పాట్నాలోని ఒక గ్రామంలో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తి తన డబ్బు తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చాడు. అతన్ని బ్యాంకులో చూసి ఉద్యోగులు షాక్ అయ్యారు.

వాస్తవానికి, ఈ వింత కేసు పాట్నా నగరానికి ఆనుకొని ఉన్న షాజహన్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సిగ్రివాన్ గ్రామంలో జరిగింది. సిగ్రివాన్ గ్రామంలో నివసిస్తున్న 55 ఏళ్ల మహేష్ యాదవ్ అనారోగ్యంతో మంగళవారం ఉదయం మరణించారు. అతడి మరణం తరువాత, గ్రామస్తులు బ్యాంకుకు వెళ్లి అతడి ఖాతాలోని డబ్బును ఇమ్మని, అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమని బ్యాంకు సిబ్బందిని అడిగారు. కానీ బ్యాంక్ మేనేజర్ డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు.

దీనితో ఆగ్రహించిన గ్రామస్తులు మహేష్ యాదవ్ శవంతో బ్యాంకు వద్దకు చేరుకుని శవాన్ని బ్యాంకు లోపల తీసుకొని వెళ్లారు. ఈ దృశ్యం చూసి బ్యాంకు ఉద్యోగులు కూడా షాక్ అయ్యారు. మహేష్ మృతదేహం సుమారు మూడు గంటలపాటు బ్యాంకులోనే ఉంది. బ్యాంకు మేనేజర్ అతడికి నామినీ ఎవరూ లేరని డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు. అయినా గ్రామస్తులు అక్కడి నుంచి కదల్లేదు. దీంతో బ్యాంక్ మేనేజర్ తన దగ్గర ఉన్న పది వేల రూపాయలు ఇచ్చి గ్రామస్తులను శాంతింపజేశారు. అప్పటికి గానీ గ్రామస్తులు శవాన్ని అక్కడి నుంచి తరలించడానికి అంగీకరించారు.

డబ్బు అందుకున్న గ్రామస్తులు మరణించిన మహేష్ యాదవ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఖర్చు చేశారు. మహేష్‌కి వివాహం కాలేదు.. అతడికి అయిన వాళ్లు కూడా ఎవరూ లేరు. అయితే అతడి బ్యాంకు ఖాతాలో ఒక లక్షా పద్దెనిమిది వేల రూపాయలు ఉన్నాయి. కానీ అతనికి బ్యాంకు ఖాతాలో నామినీ లేదు. అతడు KYC కూడా సమర్పించబడలేదు. ఈ కారణంగా బ్యాంకు అతడి డబ్బు ఇవ్వడానికి నిరాకరించింది.

కెనరా బ్యాంక్ మేనేజర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ గ్రామస్తులు మహేష్ నుండి డబ్బు తీసుకోవడానికి వచ్చారని చెప్పారు. దహన సంస్కారాలకు డబ్బు అవసరం. కానీ బ్యాంకుకు ఒక ప్రక్రియ ఉంది. దాని ప్రకారం, అతడు వాటిని చెల్లించలేదు. ఎందుకంటే అతడి ఖాతాలో నామినీ లేరు. మృతుడికి కెవైసి కూడా లేదు. అతడి మరణ ధృవీకరణ పత్రాలు తెచ్చినప్పుడు ఎవరైతే హక్కు దారుడు ఉంటారో వారికి డబ్బు ఇవ్వబడుతుందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story