కంగనా రనౌత్‌ను ఆమె శత్రువుల హత్య చేసే అవకాశం ఉంది: బీజేపీ ఎమ్మెల్యే

కంగనా రనౌత్‌ను ఆమె శత్రువుల హత్య చేసే అవకాశం ఉంది: బీజేపీ ఎమ్మెల్యే
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నంద కిశోర్ గుర్జర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నంద కిశోర్ గుర్జర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-కంపెనీ నుంచి తనకు ప్రాణ భయం ఉందని లేఖలో వివరించారు. సుమారు నెల రోజుల నుంచి తనకు విదేశాలను నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని నంద కిశోర్ గుర్జర్ తెలిపారు. ఈ కాల్స్ వెనుక దావూద్ ఇబ్రహీం ఉన్నారని తనుకు అనుమానంగా ఉందన్నారు. 'పాతాళ్ లోక్' వెబ్ సిరీస్‌లో తనను చట్టవిరుద్ధంగా చూపించారని.. వెబ్ సిరీస్‌ను నిషేధించాలని ఇటీవల తాను కోరానని లేఖలో పేర్కొన్నారు. సనాతన ధర్మం గురించి కూడా చెడుగా చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ సిరీస్ నిర్మాణం వెనుక కూడా డీ-కంపెనీ ఉందన్నారు. దీంతో పాటు బాలీవుడ్ నటి కంగన రనౌత్‌ కు కూడా ప్రాణహాని ఉందని అన్నారు. ఆమె శత్రువులు హత్య చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story