ప్రగతి భవన్ని ముట్టడించిన బీజేపీ కార్పొరేటర్లు

ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. ప్రగతి భవన్ను ముట్టడించేందుకు వచ్చిన బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే ghmc కౌన్సిల్ను ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ప్రగతి భవన్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు కార్పొరేటర్లను, నేతలను అడ్డుకున్నారు.
పోలీసులు అడ్డుకుంటున్నా వారి నుంచి తప్పించుకుని ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఘర్షణ వాతావరణం కనిపించింది.. పోలీసుల తీరుకు నిరసగా ప్రగతి భవన్ ముందే బైఠాయించిన బీజేపీ కార్పొరేటర్లు.. వెంటనే కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు.
అంతకుముందు హరిత ప్లాజాలో బీజేపీ కార్పొరేటర్లంతా సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశమైన కార్పొరేటర్లు.. కౌన్సిల్ ఏర్పాటు అజెండంగా చర్చించారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్ ముట్టడికి వచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com