అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

X
By - Admin |29 Aug 2020 8:59 PM IST
అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం
అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సెప్టెంబర్ 7 నుంచి అన్ని మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. మరోవైపు కంటైన్మెంట్ జోన్లలో సెప్టెంబర్ 30 వరకూ ఆంక్షలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. అయితే సెప్టెంబర్ 21 నుంచి పరిమిత ఆంక్షలతో సామాజిక కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది. ఇక సెప్టెంబర్ 30 వరకూ పాఠశాలలు, కళాశాలలు , కోచింగ్ సెంటర్లు మూసివేయబడతాయని పేర్కొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com