మహమ్మారి మళ్లీ ముంచుకొస్తుంది..అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

మహమ్మారి మళ్లీ ముంచుకొస్తుంది..అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
X

Coronavirus Represntional Image

Covid-19 third wave:థర్డ్ వేవ్ భయ బ్రాంతులకు గురిచేస్తోంది. ప్రపంచంలోని వంద దేశాలకు పైగా థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడం కలవరపాటుకు గురిచేస్తోంది.

కరోనా థర్డ్ వేవ్ భయ బ్రాంతులకు గురిచేస్తోంది. ప్రపంచంలోని వంద దేశాలకు పైగా థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడం కలవరపాటుకు గురిచేస్తోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల మేరకు కేంద్రం అన్నిరాష్ట్రాలను అప్రమత్తంచేసింది. రానున్న వంద రోజులు అత్యంత కీలకమని హెచ్చరించింది. చాలా దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. యావత్‌ ప్రపంచం మూడో ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధమైందని.. భారతీయులు బాధ్యతగా వ్యవహరించి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది.

థర్డ్ వేవ్ ప్రపంచంలోని చాలా దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఉత్తర, దక్షిణ అమెరికాలు తప్పితే మిగతా ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దీనిని రెడ్ ప్లాగ్ గా భావించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. దీన్ని హెచ్చరిక గా భావించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సూచించారు. ముఖ్యంగా థర్డ్‌వేవ్‌ను ఆపాలనే లక్ష్యాన్ని మాకు నిర్దేశించారు. ఇది వాస్తవంగా సాధ్యమైనదే' అని నీతి ఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వీకే పాల్‌ పేర్కొన్నారు. స్పెయిన్‌లో కరోనా వైరస్‌ వారపు కేసుల్లో 64 శాతం, నెదర్లాండ్‌లో 300శాతం పెరిగాయి. థాయిలాండ్‌లో చాలా రోజులుగా పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నప్పటికీ తాజాగా అక్కడ మరోసారి వైరస్‌ ఉద్ధృతి పెరిగింది. ఆఫ్రికాలోనూ పాజిటివ్‌ కేసుల్లో 50 శాతం పెరుగుదల కనిపిస్తోంది. మయన్మార్‌, బంగ్లాదేశ్, మలేసియా, ఇండోనేసియా దేశాల్లో ఊహించని విధంగా వైరస్‌ తీవ్రత పెరుగుతోందని వీకే పాల్‌ గుర్తుచేశారు.

'దేశంలో చాలా మందికి వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఇన్‌ఫెక్షన్‌ నుంచి కూడా మనం ఇంకా హెర్డ్‌ ఇమ్యూనిటీ పొందలేదు. వ్యాక్సినేషన్‌ ద్వారానే దీన్ని పొందాల్సి ఉంది. కనీసం 50 శాతం మందికి టీకాలు ఇవ్వడం ద్వారా ఇది సాధ్యం కావచ్చు. అయినప్పటికీ ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ఇదే పరిస్థితిని మున్ముందు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా వచ్చే 100 రోజులు అత్యంత కీలకం' అని వీకే పాల్‌ స్పష్టం చేశారు. అయితే, థర్డ్‌వేవ్‌ ప్రారంభమయ్యిందా లేదా అనేది ముఖ్యం కాదని.. వైరస్‌ను ఏమేరకు ఎదుర్కొంటున్నామన్నదే ముఖ్యమని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

Tags

Next Story