బెంగళూరులో 1501 మంది పోలీసులకు కరోనా పాజిటివ్
By - Admin |28 Aug 2020 12:13 PM GMT
దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. కర్ణాటకలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక పోలీస్ శాఖలో కరోనా కలవరం పెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1501 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి కరోనా సోకింది. కరోనా బారిన పడి మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారని బెంగళూరు పోలీస్ కమిషనర్ తెలిపారు. కరోనా బారిన పడిన వారిలో కేవలం 1 శాతం మంది పోలీస్ సిబ్బంది మాత్రమే మృత్యువాత పడినట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాధి సోకిన పోలీస్ సిబ్బందిలో 1,100 మంది త్వరగా కోలుకొని తిరిగి విధుల్లో చేరారని ఆయన తెలిపారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com