తెలంగాణలో కొత్త కరోనా కేసులు

X
By - prasanna |22 Sept 2020 9:19 AM IST
నిన్న కరోనా నుంచి కోలుకున్న వారు 2,143
రాష్ట్రంలో 2,166 కొవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,74,774కు చేరిందని మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. ఇక నిన్న కరోనాతో 10 మంది మృతి చెందినట్లు స్పష్టం చేసింది. దీంతో మృతుల సంఖ్య 1,952కి చేరింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారు 2,143 మంది. దీంతో కోలుకున్న బాధితుల సంఖ్య 1,44,073 కి చేరింది. వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారు 29,649 మంది ఉన్నారు. హోం ఐసోలేషన్లో ఉన్నవారు 22,620 మంది అని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 309 కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com