మౌత్వాష్తో కరోనా.. !!
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చేలోపు రోగుల ప్రాణాలు కాపాడే ప్రయత్నాలు కోకొల్లలుగా చేస్తున్నారు వైద్యులు. అయితే నోటిలోని సూక్ష్మ క్రిములు అనారోగ్య హేతువులు. ఈ క్రిములను నిర్మూలించేందుకు వాడే మౌత్వాష్తో కరోనా అంతమవుతుందని బ్రిటన్లోని యూనివర్శిటీ హాస్పిటల్ ఆఫ్ వేల్స్ పరిశోధకులు చెబుతున్నారు. సెటిపైరిడినియం క్లోరైడ్ (సీపీసీ)తో తయారు చేసిన మౌత్వాష్లు నోటిలోని కొవిడ్-19ను కేవలం 30 సెకండ్లలోనే పూర్తిగా చంపివేయగలవని ఈ పరిశోధనలో పాలు పంచుకున్న నిక్ క్లేడన్ తెలిపారు. మౌత్వాష్లో సీపీసీ 0.07 శాతం ఉన్నా కరోనాను అంతం చేయగలదన్నారు. అయితే, ఈ మౌత్వాష్లు కరోనా చికిత్సకు ఉపయోగపడుతాయని చెప్పలేమని, కడుపులోకి చేరిన కరోనాను చంపలేకపోవచ్చని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com