ఎకానమీ గాడిలో పెట్టేందుకు మరో ప్యాకేజీ

ఎకానమీ గాడిలో పెట్టేందుకు మరో ప్యాకేజీ

కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మరో ప్యాకేజీ సిద్దం చేస్తోంది కేంద్రం. ఇప్పటికే రెండు దశల్లో కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం.. పారిశ్రామికవేత్తలు, వ్యాపార నిపుణులు, ఆర్థికవేత్తల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటుంది. ఎకానమి మళ్లీ ట్రాక్ ఎక్కడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరుపుతోంది. ఇందులో భాగంగా రిఫామ్స్ లింక్డ్ ప్యాకేజీ సిద్దం చేస్తున్నట్టు చెబుతున్నారు. CII వెబినార్ లో ఆర్ధిక శాఖ కార్యదర్వి తరుణ్ బజాజ్ దీనిపై స్పష్టత ఇచ్చారు. ఇండస్ట్రీలకు ఆదుకోవాల్సిన అవసరం ఉందని.. ఇందులో భాగంగా సలహాలు స్వీకరించి త్వరలోనే మంచి ప్యాకేజీతో వస్తామన్నారు. అంతకుముందు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్దీపనలపై ఇంకా తలుపులు మూసుకపోలేదని.. రకరకాల ఆప్షన్లు పరిశీలిస్తున్నామని మంత్రి అన్నారు.

Also Read:profit your trade


Tags

Read MoreRead Less
Next Story