Crime: భూతగాదాల్లో కాల్పులు.. అసువులుబాసిన చిన్నారి

Crime: భూతగాదాల్లో కాల్పులు.. అసువులుబాసిన చిన్నారి
దుండగులు జరిపిన కాల్పుల్లో గాల్లో కలిసిన అన్యంపుణ్యం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు

బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది. దుండగులు జరిపిన కాల్పుల్లో అన్యంపుణ్యం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన భోజ్‌పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం రాత్రి బిలాయి గ్రమానికి చెందిన కృష్ణసింగ్‌ నివాసంలోకి నలుగుదు దుండగులు తుపాకులతో చొరబడ్డారు. కృష్ణసింగ్‌ను దూషిస్తూ విచక్షణారహితంగా కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ క్రమంలో ఆయన కుమార్తె ఆరాధ్య ప్రణాలు కోల్పోయింది. 25ఎకరాల భూమి విషయంలో మరో వ్యక్తితో తనకు తగాద ఉందని ఈ విషయం మూలంగానే నాలుగేళ్ల క్రితం తన సోదరున్ని కూడా పొట్టన బెట్టుకున్నారని కృష్ణసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story