Delhi: లిక్కర్ స్కాంలో వచ్చిన పైసలతోనే గోవా ఎన్నికలు...!

Delhi: లిక్కర్ స్కాంలో వచ్చిన పైసలతోనే గోవా ఎన్నికలు...!
గోవా ఎన్నికల కోసం ఢిల్లీ లిక్కర్ స్కామే పెట్టుబడి; ఈడీ ఛార్జ్ షీట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులతోనే ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచారం నిర్వహించిందని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై జరిగిన విచారణ ఈ కోణం వెల్లడైందని అధికారులు స్పష్టం చేశారు. ఈమేరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్లు వెల్లడించారు. 2022లో గోవాలోని జరిగిన అసెంబ్లీ ఎలెక్షన్లలో ఆప్ రెండు సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సుమారు రూ. 70 లక్షలు కార్యకర్తలకు పంచిపెట్టినట్లు వెల్లడైంది. వీరంతా ఆప్ సర్వే బృంద సభ్యులేనని తెలుస్తోంది. ఈ మేరకు ఆప్ కమ్యునికేషన్స్ ఇన్ ఛార్జ్ విజయ్ నాయర్ ను విచారించగా ప్రచార పనుల నిమిత్తం కొందరికి భారీగా నగదును అందజేసినట్లు అంగీకరించారని ఈడీ అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story