Delhi: వీళ్లు మారరు....
బైక్ ను ఢీ కొన్న కారు కొన్ని కిలోమీటర్ల మేర ద్విచక్రవాహనదారులను ఈడ్చుకెళ్లిపోతున్న ఘటనలు దేశ రాజధానిలో షరామామూలు వ్యవహారంగా మారిపోయాయి. న్యూ ఇయర్ రోజున ఢిల్లీలో ఓ యువతి ఇదే రకంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరచిపోక ముందే గురుగ్రామ్ వద్ద ఇదే తరహాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ 62లో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా, వారి వెనుకగా అత్యంత వేగంగా వచ్చిన అమేజ్ హోండా కారు బైక్ ను ఢికొట్టింది. ఈ ధాటికి బైక్ పైన ఉన్న ఇద్దరూ కింద పడిపోగా, కారు ఆగకుండా ముందుకు దూసుకుపోయింది. దీంతోపాటే బైక్ ను కూడా ఈడ్చుకు వెళ్లిపోయింది. సుమారు 4 కి.మిల వరకూ బైక్ ను లాక్కెళ్లిన పిమ్మట ఆగింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇరువురికీ తీవ్రగాయాలు అవ్వగా, కారు నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని తెలుస్తోంది. ఈ మేరకు కంప్లైంట్ నమోదు చేసుకున్న పోలీసులు, దర్యప్తు ప్రారంభించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com