Delhi : సిసోడియా ప్రాసిక్యూషన్కు కేంద్ర హోం శాఖ అనుమతి
By - Vijayanand |22 Feb 2023 5:34 AM GMT
ఫీడ్బ్యాక్ యూనిట్' ముసుగులో రాజకీయ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు సిసోడియాపై ఆరోపణలు ఉన్నాయి
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రాసిక్యూషన్కు కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది. ఫీడ్బ్యాక్ యూనిట్' ముసుగులో రాజకీయ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు సిసోడియాపై ఆరోపణలు ఉన్నాయి. 2016లో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో మాజీ ఇంటెలిజెన్స్ ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అవినీతి అధికారులను ట్రాప్ చేసే అధికారాన్ని కూడా FBUకు ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చింది. ఈ అంశంపై దర్యాప్తు జరిపించాల్సిందిగా సీబీఐకి లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేశారు. ఇదే అంశంపై దర్యప్తు కోసం కేంద్రం హోంశాఖ నుంచి సీబీఐ గ్రీన్ సిగ్నల్ కోరింది. ఇపుడు హోం శాఖ నుంచి అనుమతి రావడంతో ఏక్షణమైనా సిసోడియా కేసు నమోదు చేసే అవకాశముంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com