Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రికి కోవిడ్..

Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రికి కోవిడ్..
Delhi: గత కొద్ది రోజులుగా తనతో టచ్‌‌లో ఉన్నవారంతా, దయచేసి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ముఖ్యమంత్రి పోస్ట్ చేసారు.

Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా సోకింది. ఈ ఉదయం ఆయయను పరీక్షించగా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, దీంతో హోంఐసోలేషన్‌లో ఉన్నానని ట్వీట్ చేశారు. గత మూడు రోజుల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఎన్నికల ప్రచారం కోసం భారీ ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించిన కేజ్రీవాల్ కోవిడ్ బారిన పడ్డారు. అయితే తనకు "తేలికపాటి లక్షణాలు" ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. గత కొద్ది రోజులుగా తనతో టచ్‌‌లో ఉన్నవారంతా, దయచేసి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ముఖ్యమంత్రి పోస్ట్ చేసారు.

Tags

Read MoreRead Less
Next Story