Delhi Mayor Election : కొనసాగుతున్న ఢిల్లీ మేయర్ ఎన్నిక

Delhi Mayor Election : కొనసాగుతున్న ఢిల్లీ మేయర్ ఎన్నిక
విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తక్షణమే ఎన్నిక జరపాలని ఆదేశాలు జారీ చేసింది

మూడు సార్లు వాయిదా పడిన ఢిల్లీ మేయర్ ఎన్నిక పక్రియ కొనసాగుతుంది. మేయర్ ఎన్నిక తరువాత డిప్యూటీ మేయర్‌తో పాటు ఆరుగురు స్టాండింగ్‌ కమిటీ సభ్యులను కూడా ఎన్నుకుంటారు. ఇప్పటికే మూడు సార్లు మేయర్ ఎన్నిక సమావేశం నిర్వహించగా నామినేటెడ్ సభ్యుల ఓటు హక్కు విషయంలో బీజేపీ, ఆప్ ల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ నేపధ్యంలో ఆప్ సుప్రీంకోర్డును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తక్షణమే ఎన్నిక జరపాలని ఆదేశాలు జారీ చేసింది.దీంతో మేయర్ ఎన్నికకు లైన్‌ క్లియర్‌ అయింది. మోజారిటీ ప్రకారం మేయర్ సీటును ఆప్ దక్కించుకునే ఛాన్స్‌ ఉంది.

ఢిల్లీ మేయర్ ఎన్నికలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసిన 10 మంది కౌన్సిలర్లకు మేయర్ ఎన్నికలో ఓటు వేసేందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ అనుమతించడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. నామినేటెడ్ సభ్యులంతా బీజేపీకి ఓటేస్తారంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసింది. వాదనలు విన్న సుప్రీం కోర్టు ఆప్ వాదనలతో ఏకీభవించి తక్షణమే ఎన్నిక జరపాలని ఆదేశించింది. డీఎంసీ యాక్ట్ 1957 ప్రకారం నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసే అధికారం లేదని చెప్పింది.

Tags

Next Story